రొమాంటిక్ థ్రిల్లర్‌గా కవచం

255
kavacham
- Advertisement -

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అందాల తారలు కాజల్ అగర్వాల్, మెహ్రీన్ హీరోయిన్స్ గా వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్ళని దర్శకుడిగా పరిచయం చేస్తూ నవ, యువ నిర్మాత నవీన్ శొంఠినేని(నాని ) రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రం కవచం. చోటా కె. నాయుడు ఫోటోగ్రఫీ, థమన్ సంగీతమ్ అందిస్తున్నారు. డిసెంబర్ లో సినిమా విడుదల కానుంది.

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మంచి కంటెంట్ బేస్డ్ మూవీ చెయ్యాలని ఒక 50 కథలు విన్నాను. అందులో శ్రీనివాస్ చెప్పిన ఈ స్టోరీ నాకు బాగా నచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. ఎంటర్ టైన్మెంట్ తో పాటు కథ కథనం చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ప్రతి ఒక్కరికీ ఈ మూవీ నచ్చుతుందన్నారు. కాజల్ సినిమాకు మరింత గ్లామర్ తెచ్చిందని మెహ్రీన్ ఒక కీ రోల్‌లో నటించిందని ఛాలెంజింగ్ గా తీసుకుని ఆ పాత్ర చేసిందన్నారు.

ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అని ఎంటర్టైన్ మెంట్ తో సాగె థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ సినిమా అన్నారు కాజల్. స్టోరీ విని చాలా ఎక్సయిట్ అయ్యాను. నిజంగా వెరీ ఇంటిలిజెంట్ మూవీ ఇది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్నా క్యారెక్టర్ లో నటించానని తెలిపారు. మెహ్రీన్ మాట్లాడుతూ ఈ చిత్రంలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా మంచి ఎక్స్ పీరియన్స్ ని కలిగించింది… అన్నారు.

- Advertisement -