200 కోట్లు.. సల్మాన్‌ – కత్రినా ఎంజాయ్

35
- Advertisement -

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌, కత్రినా కైఫ్ ఓ థియేటర్‌లో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను యశ్‌ రాజ్ ఫిల్మ్స్‌ ఎక్స్‌లో పంచుకుంది. వీళ్లు నటించిన ‘టైగర్‌-3’ సినిమా తాజాగా విడుదలై సూపర్ హిట్‌ అందుకుంది. ఈ క్రమంలో మూవీ టీం ముంబయిలోని థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో ముచ్చటించింది. దీంతో అభిమానుల కోరిక మేరకు ఓ పాటకు హుషారైన స్టెప్పులేసి కత్రినా-సల్మాన్‌ అలరించారు.

ఇక ఈ సినిమా ఇప్ప‌టివ‌ర‌కు రూ.183 కోట్లను వ‌సూలు చేసింది. త్వ‌ర‌లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో టైగ‌ర్3 చేర‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న టైగ‌ర్ 3 ఇప్ప‌టివ‌ర‌కూ రెండు భాష‌ల్లో క‌లిపి రూ.5.25 కోట్లు వ‌సూలు చేసింది. లాంగ్‌ర‌న్‌లో టైగ‌ర్‌3 మ‌రిన్ని క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టే ఛాన్సుంది. సల్మాన్‌ ఖాన్‌ నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీగా `టైగర్‌ 3`కి మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కూడా కొత్త పాత్రల విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా ఈ యూనివర్స్‌లో భాగంగానే రూపొందుతున్న ‘వార్‌ 2’లో హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటించనున్న సంగతి తెలిసిందే. టైగర్ 3లో వార్ 2 మూవీ గురించి కూడా రివీల్ చేశారు.

Also Read:Harishrao:కేసీఆర్ అంటే నమ్మకం,విశ్వాసం

- Advertisement -