- Advertisement -
మాల్దీవుల బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ను నియమించింది మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్. మాల్దీవుల పర్యాటక రంగాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించడంలో భాగంగా కత్రినా కైఫ్ని నియమించినట్లు మాల్దీవ్స్ పర్యటక శాఖ వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్ పర్యటనకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో జరగడం విశేషం. కత్రినా కైఫ్ వంటి ప్రముఖ వ్యక్తిని అంబాసిడర్గా నియమించడం ద్వారా భారతీయ పర్యాటకులను తిరిగి ఆకర్షించి, మాల్దీవులకు వచ్చే అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్యను పెంచాలని మాల్దీవ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఆ దేశ అధికారులు తెలిపారు.
Also Read:రాహుల్తో రేవంత్ భేటీ..
- Advertisement -

