తెలుగు సినిమాపై క్లారిటీ ఇచ్చిన కార్తీ..

233
Karthi Clarity On Telugu Movie director Venu Udugula?
- Advertisement -

తమిళ యంగ్ హీరో కార్తీ విభిన్న కథా కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఆయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నారు. అనువాద చిత్రం ఆవారాతో.. మొదలై ఖాకీ సినిమా వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు కార్తీ. తెలుగులో నాగార్జునతో కలిసి ఊపిరి చిత్రంలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.

Karthi commit With Telugu Movie director Venu Udugula?

అయితే ఇన్నాళ్లుగా అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన కార్తీ తన తదుపరి చిత్రాన్ని తెలుగులో డైరెక్ట్ మూవీ చేస్తున్నాడని, తెలుగు కొత్త దర్శకుడితో ఓ మూవీ చేయడానికి అంగీకరించినట్లు సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారట.అయితే ఇటీవలె విడుదలై మంచి విజయాన్ని అందుకున్న’ నాదీ నాదీ ఒకే కథ’ చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల హీరో కార్తీని కలిసి కథ వినిపించాడని, దానికి కార్తీ కూడా ఓకే చెప్పారని కూడా వార్తలోచ్చాయి. మొత్తం కథ సిద్దం చేశాక మరోసారి కలుద్దామని చెప్పారని ప్రచారం కూడా జరిగింది.

కానీ దీనిపై స్పందించిన కార్తీ తనను ఎవరూ కలవలేదని, ఏ కథా వినిపించలేదని అనసరమైన వార్తలను నమ్మోదని కార్తీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో కార్తీ 2డీ ఎంటర్‎టైన్ మెంట్ బేనర్‎పై కడైకుట్టి సింగం అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఇందులో సాయేషా సైగల్ హీరోయిన్‎గా చేస్తుంది. ఇక తన 17వ చిత్రాన్ని రజత్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇందులో కథానాయికగా రకుల్‎ప్రీత్‎సింగ్ చేయనున్నారు.

- Advertisement -