కర్ణాటకలో రాత్రి పూట కర్ఫ్యూ!

206
karnataka
- Advertisement -

యుకేలో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే భారత్‌..బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించగా తాజాగా పలురాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి.

ఈ క్రమంలో నేటి నుండి జనవరి 2 వరకు రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని తెలిపారు సీఎం యెడియూరప్ప. ప్రజలంతా సహకరించాలని కోరారు.

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కార‌ణంగానే రాష్ర్టంలో నైట్ క‌ర్ఫ్యూ విధించామ‌ని పేర్కొన్నారు. నేటి నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు రాత్రిళ్లు ఎలాంటి సెల‌బ్రేష‌న్స్‌కు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

- Advertisement -