కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంటే ఎవరికి తెలియదు. కానీ అప్పు అంటే మాత్రం అందరికి తెలుసు. పునీత్ను కన్నడిగులు ముద్దుగా అప్పు అంటూ పిలుచుకుంటుంటారు. కానీ అప్పు గత సంవత్సరం మరణించిన విషయం తెలిసిందే. కన్నడనాట నటుడిగానే కాకుండా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించుకున్నారు.
జూ.ఎన్టీఆర్ త్వరలో కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆహ్వానం మేరకు నవంబర్1న అక్కడి అసెంబ్లీలో జరగనున్న కన్నడ రాజ్యోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్ దివంగత నటుడు పునీత్రాజ్కుమార్కు కర్ణాటకలో విశిష్ట పురస్కారంగా భావించే కర్ణాటక రత్న అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డు అందుకోనున్న తొమ్మిదోవ వ్యక్తిగా పునీత్ చరిత్రకెక్కనున్నాడు.
అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ను ఎందుకు పిలిచారంటే పునీత్తో మంచి సాన్నిహిత్యం ఉన్నందున్న కర్ణాటక ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, మరియు పునీత్రాజ్కుమార్ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.
ఇవి కూడా చదవండి..