కర్ణాటక సీఎంకు కరోనా..

61
bommai
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల సీఎంలు కరోనా బారిన పడగా తాజాగా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మై క‌రోనా బారిన ప‌డ్డారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాల‌తో బాధ‌ప‌డుతున్న తాను కొవిడ్ టెస్టులు చేయించుకోగా, క‌రోనా పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిందని సీఎం తెలిపారు. ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకొని, జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు.

జులై 25, 26 తేదీల్లో బొమ్మై ఢిల్లీలో ప‌ర్య‌టించిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మంలో క‌ర్ణాట‌క సీఎం పాల్గొన్నారు.

- Advertisement -