18వ రోజు కొనసాగుతున్న అన్నదానం..

297
santhosh
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు రాజ్యభ సభ్యులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వలజీవుల ఆకలి తీర్చేందుకు చేపట్టిన అన్నదాన కార్యక్రమం 18వ రోజు విజయవంతంగా కొనసాగుతోంది. బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 18వ రోజుకు చేరింది కోదురుపాక TRS యువనాయకులు భోజనాలు వడ్డించారు.

TRS రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు విధిగా మాస్కులు ధరించాలి , వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, సామాజిక దూరం పాటిచాలి అని ప్రతి రోజు అన్నదాన కేంద్రం వద్ద కరోనాని అరికట్టడానికి అవగాహనా కల్పిస్తున్నామని అన్నారు.

మా ఊరి ముద్దుబిడ్డ ఇంతలా కార్మికుల కోసం ముందుకు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నదాత సుఖీభవో అన్నారు పెద్దలు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న సంతన్నకి మా కృతజ్ఞతలు అని జడ్పీటీసీ కత్తెరపాక ఉమకొండయ్య తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామశాఖ TRS అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, TRS నాకులు, ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, చింతలపల్లి తిరుపతి రెడ్డి, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు, బాలగొని మల్లేశం పాల్గొన్నారు.

santhosh

- Advertisement -