అధికారులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి గంగుల

65
gangula
- Advertisement -

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భాగంగా కరీంనగర్‌ జిల్లాలో ప్రాణ ఆస్తి పంట నష్టం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఆర్ వి కర్ణన్, సీపీ సత్యనారాయణ, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, మేయర్ వై సునీల్ రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణితో కలిసి నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

చెరువులు, కుంటలు నిండిపోయాయని, ఎక్కడ ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదని మంత్రి తెలిపారు. డ్రైనేజీ సిస్టంను మెరుగుపర్చటంతో పాటు మున్సిపల్ అధికారుల ముందుచూపుతో నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నిల్వ లేదన్నారు. వంగిపోయిన, తుప్పుపట్టిన కరెంట్ పోల్ ను వెంటనే మరమ్మతులు చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి ఆదేశించారు. జిల్లాలోని చెక్ డ్యామ్ లన్నీ సురక్షితంగా ఉన్నాయన్నారు. భారీ వర్షాల వల్ల వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన వెంటనే స్పందించడం కోసం జిల్లా కలెక్టరేట్ లో కాల్ సెంటర్ 0878 – 2265 ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -