కాంతార సినిమాపై కంగనా కామెంట్‌…

88
- Advertisement -

నిత్యం వార్తల్లో ఉండేందుకు ఇష్టపడే బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌…తాజాగా మరోసారి వార్తాల్లో నిలిచింది. భారీ అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న కన్నడ చిత్రం కాంతార. ఇప్పుడీ సినిమా పాన్‌ ఇండియా క్రేజ్‌ సొంతం చేసుకున్న….రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చి..సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. తాజాగా కంగనారనౌత్‌ ఈచిత్రంపై స్పందించింది.

కుటుంబ సభ్యులతో కలిసి కాంతార సినిమా చూశా. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్‌ శెట్టికి హ్యాట్సఫ్‌. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరో స్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉంది.

సినిమా అంటే ఇది. ఇప్పటి వరకు ఇలాంటి సినిమాను చూడలేదంటూ కొందరు ప్రేక్షకులు సినిమా అయిపోయిన తర్వాత బయటకు వస్తూ అనుకుంటుండటం నేను విన్నాను. ఇలాంటి సినిమా తీసినందుకు ధన్యవాదాలు. మరో వారం పాటు ఈ అనుభూతి నుంచి నేను బయటకు రాలేననే అనుకుంటున్నా అంటూ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. నటనలోనే కాదు దర్శకత్వ ప్రతిభలో కూడా రిషబ్‌శెట్టి ఫుల్‌ మార్కులు సొంతం చేసుకున్నారు. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబర్‌ 15న విడుదలై అందరి ప్రశంసలు అందుకుంటోంది.

- Advertisement -