పబ్లిక్‌లోనే ఆ వ్యక్తి నన్ను గిల్లాడు-కంగనా

237
Kangana Ranaut
- Advertisement -

ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకెదురైన చేదు అనుభవాలను ఓ ఇంటర్క్యూలో వెల్లడించింది. తన తాజా చిత్రం ‘మణికర్ణిక’ ప్రచారం కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మీటూ ప్రభావంతో చిత్ర సీమలో చాలా మార్పు వచ్చిందని చెప్పింది. మహిళా నటులతో పిచ్చి వేషాలు వేసేవారు… ఇప్పుడు అలా ప్రవర్తించడానికి ఆలోచిస్తున్నారని తెలిపింది.

Kangana Ranaut

ఓసారి ఓ కార్యక్రమానికి హాజరైనప్పుడు అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నన్ను గిల్లాడు. అతను నా వెనకే నిలబడి ఉన్నాడు. ‘ఇప్పుడేం చేయగలవ్‌’ అన్నట్టుగా అతను చూసిన చూపు నాకెంతో చిరాకు కలిగించింది. ఆడపిల్లలు రక్షణ కోసం మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలని గతంలో రాణీ ముఖర్జీ అన్నారు. ఆమె చెప్పింది ముమ్మాటికీ నిజమే. కానీ అలా మాట్లాడినందుకు ఆమెపై కామెంట్లు చేయడం బాధాకరం’ అని వెల్లడించారు కంగన.

- Advertisement -