ఆమె హీరోల గదులకు వెళ్లదట

58
- Advertisement -

కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల పై నిర్మొహ‌మాటంగా మాట్లాడి… అన‌వ‌స‌రంగా ఆయా హీరోల ఫ్యాన్స్ నుంచి త‌ల నొప్పులు తెచ్చుకుంటూనే ఉంటుంది. ఆ మధ్య స్టార్ హీరో షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లపై బ్యాడ్ కామెంట్స్ చేసి తీవ్ర ఆగ్ర‌హానికి గురి అయింది. అయినా కంగనా రనౌత్ లో ఎలాంటి మార్పు లేదు. ఎప్పటికప్పుడు తన కామెంట్ల తీవ్రతను పెంచుతూనే పోతుంది. తాజాగా ఈ బాలీవుడ్ హీరోయిన్ల పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది.

ఇంతకీ కంగనా ఏం మాట్లాడిందో ఆమె మాటల్లోనే.. ‘నేను హీరోల గదులకు వెళ్లను. ఇతర అమ్మాయిల లాగా కబుర్లు చెప్పను. పెళ్లిళ్లలో డ్యాన్స్ వేయను. అందుకే నాపై పిచ్చిది అనే ముద్ర వేశారు’ అని కంగనా చెప్పింది. అంతేకాకుండా తన శత్రువులను ఉద్దేశించి భిఖారీ సినీ మాఫియా అంటూ కంగనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కంగనా రనౌత్ హాట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మొత్తానికి కంగనా గత కొంతకాలంగా బాలీవుడ్ లో హీరోల ఆధిపత్యం పై నోరు పారేసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో కంగనా రనౌత్ కి బాగా అహంకారం పెరిగిందంటూ బాలీవుడ్ స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. అయినా కంగనా రనౌత్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చి కామెంట్స్ సైతం అలవోకగా చేసేస్తూ మొత్తానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి..

 

- Advertisement -