డబ్బు కోసం ఆ పని చేయను – కంగనా

7
- Advertisement -

అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో సెలబ్రిటీలు డాన్సులు చేయడంపై నటి కంగనా రనౌత్ సెటైర్లు వేశారు. తనకు ఎంత డబ్బు ఇచ్చినా అలాంటి ప్రదర్శనలు చేయనని ఇన్‌స్టా వేదికగా చెప్పారు. ‘ప్రముఖ గాయని లతా మంగేష్కర్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పెళ్లిళ్లలో, అవార్డుల వేడుకలలో ప్రదర్శన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. నేనూ అంతే. డబ్బు కంటే గౌరవం ముఖ్యం అని బలంగా నమ్ముతా’ అని కంగనా తెలిపారు. అయితే నెటిజన్లు మాత్రం మరో రకంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో డబ్బులు కోసం బ్లూ ఫిల్మ్ లో కూడా నటించబోయాను అని కంగనా రనౌత్ చెప్పింది అని, కానీ ఇప్పుడు మాత్రం పత్తిత్తు కబుర్లు చెబుతుంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

అయితే, ఇప్పుడు కంగనా రనౌత్ ఈ కామెంట్స్ చేయడం వెనుక ఓ కారణం ఉంది. హిందీతో పాటు తెలుగులోనూ మరియు తమిళంలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కంగనా. కాగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ బిజినెస్ మెన్ కంగనా రనౌత్ కు రూ.50 కోట్లతో ఇల్లు కొనిచ్చారని బాగా ప్రచారం జరుగుతుంది. ఫలితంగా కంగనా రనౌత్ అతనితో ఓ విదేశీ ట్రిప్ కూడా వెళ్లి వచ్చింది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ పైవిధంగా స్పందించింది. అలాగే తన పై జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆమె తప్పుబట్టారు.

తాను పేరొందిన కుటుంబం నుంచి వచ్చానని.. 20 ఏళ్లకు పైగా తన కష్టంతోనే తాను ఈ స్థాయిలో ఉన్నానని కంగనా రనౌత్ చెప్పారు. కొందరు తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్‌లో కంగనా రనౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకెవ్వరూ ఇల్లు కొనివ్వలేదన్నారు. అసత్య ప్రచారం చేయొద్దని ఆమె కోరారు. మొత్తమ్మీద ఈ మధ్య కంగనా రనౌత్ కి వరుస ప్లాప్ లు పడేసరికి ఆమెలో కాస్త మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. గతంలో తన పై ఎవరైనా కామెంట్స్ చేస్తే.. వారి పై కంగనా రనౌత్ విరుచుకుపడేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

Also Read:ఎల్ఆర్ఎస్‌పై బీఆర్‌ఎస్‌ ఆందోళన

- Advertisement -