విలియమ్సన్ డబుల్ ధమాకా..

282
- Advertisement -

కరాచి వేదికగా పాకిస్ధాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అదరగొట్టాడు. డబుల్ సెంచరీతో నూతన సంవత్సరానికి గ్రాండ్ వెల్ కమ్ చెప్పాడు. 722 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన కేన్.. దాన్ని డబుల్ సెంచరీగా మలిచాడు. దీంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 612/9 వద్ద డిక్లేర్ చేసింది.

395 బంతుల్లో 21 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 200 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. కేన్ విలియమ్సన్‌కు టెస్టుల్లో ఇది ఐదో డబుల్ సెంచరీ కాగా టెస్టుల్లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 174 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి పాక్‌..77 పరుగులకు 2 వికెట్లు కొల్పోయింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -