30 ఏళ్ల తర్వాత తెరపై అలనాటి తార..

258
kanchana
- Advertisement -

ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో అలరించిన తొలితరం హీరోయిన్ కాంచన. అలనాటి దక్షిణాది మేటి నటి కాంచన దాదాపు 30 ఏళ్ల తర్వాత మళ్లీ నటించబోతోంది. యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. చాలా ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమెను, ఎంతో కష్టపడి ఈ సినిమాకు ఒప్పించినట్లు దర్శకుడు సందీప్ వంగ తెలిపారు.

విజయ్‌ హీరోగా నటించిన ’ద్వారకా’, ’అర్జున్ రెడ్డి’ అన్న రెండు సినిమాలు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఇందులో అర్జున్ రెడ్డి, ఒక అర్బన్ యువకుడి ఆలోచనల చుట్టూ తిరిగే కథగా ప్రచారం పొందుతోంది. ఈ సినిమాలో విజయ్‌కి బామ్మగా నాటితరం ప్రఖ్యాత నటి కాంచన నటిస్తూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.

విజయ్‌కు బామ్మగా కాంచన నటించనుందని, సినిమాలో ఆమెది కీలక పాత్రని చెప్పాడు. బుధవారం నుంచి ఆమె షూటింగ్‌లో పాల్గొంటుందని తెలిపాడు. 77 ఏళ్ళ వయసులోనూ 40ల్లో ఉన్నట్లు కనిపిస్తూ, ఇంగ్లీష్ మాట్లడగలిగే ఈ పాత్ర రాసుకోగానే మొదట ఆమే గుర్తొచ్చారు” అంటూ దర్శకుడు అర్జున్ రెడ్డిలో కాంచన పాత్ర గురించి చెప్పారు. విజయ్ దేవరకొండ సరసన జియా శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూట్ చివరిదశలో ఉంది. కాంచన చివరిసారిగా శ్రీదత్త దర్శనం అనే తెలుగు సినిమాలో నటించింది. ఈ సినిమా 1985లో విడుదలైంది. ఆత్మగౌరవం, నవరాత్రి, ప్రైవేట్‌ మాస్టర్‌ వంటి తెలుగు సినిమాలతో ఆమె పాపులర్‌ అయ్యింది. సందీప్ వెంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకొని జనవరిలో రిలీజ్ కానుందని టాక్.

- Advertisement -