అధికార లాంఛనాలతో రాంరెడ్డి అంత్యక్రియలు…

123
kamatham
- Advertisement -

మాజీ మంత్రి కమతం రాంరెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం వ్యక్తంచేశారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం… రామిరెడ్డి అంత్యక్రియలు అధికార లాంచనాలతో నిర్వహించాలని సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

1968లో కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌విప్‌గా పనిచేశారు. 1977లో వెంగళరావు మంత్రివర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా, 1991లో నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి మంత్రివర్గంలో మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ, 1992లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. ఇవాళ సాయంత్రం మహబూబ్‌నగర్‌ మహమ్మదాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

- Advertisement -