మొక్కలు నాటిన ట్రస్మా అధ్యక్షులు ఆనంద్ రావు..

155
gic
- Advertisement -

పర్యావరణ పరిరక్షణకై కంకణం ధరించిన గౌరవ రాజ్య సభ సభ్యులు జోగిన పల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం లో నేను సైతం అంటూ కామారెడ్డి జిల్లా ట్రస్మా అధ్యక్షులు తానోబ ఆనంద్ రావు తన జన్మదినం సందర్భంగా తన పాఠశాల చైతన్య విద్యానికేతన్ హైస్కూల్ ఆవరణలో మూడు మొక్కలు నాటినారు. ఈ కార్యక్రమం లో ఆనంద్ రావు భార్య TPTF రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు సుమిత్రానంద్ కుమార్తె మహతి పాల్గొన్నారు. తమ ఇండ్లల్లో జరుపుకునే వివిధ రకాల వేడుకల్లో కనీసం ఒక్క మొక్క నాటినా జ్ఞాపకంగా ఎదిగి పర్యావరణానికి మేలుచేస్తుంది అని ఆనంద్ రావు అన్నారు .

- Advertisement -