టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నాయకులు..

112
trs
- Advertisement -

ఈ రోజు మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోచారం మున్సిపల్ 15వ వార్డు కౌన్సిలర్ సరిత స్వామి కాంగ్రెస్ పార్టీ నుండి 100 మంది అనుచరులతో పాటు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారందరికి మంత్రి గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మన ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి విరందరు టీఆర్‌ఎస్‌ పార్టీలో జాయిన్ అయ్యారు. గత 6సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్1 స్థానంలో వుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -