విప్ గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే గంప గోవర్ధన్

333
mlagampa
- Advertisement -

ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే గంప గోవర్దన్.

మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. .సీనియర్ శాసనసభ్యులైన గంపగోవర్ధన్ ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా ఆయనకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పేదలకోసం పనిచేసే వ్యక్తిత్వం గల వ్యక్తి గంప గోవర్దన్ అని అన్నారు.

- Advertisement -