చాలా కాలం తర్వాత సూపర్ హిట్ అందుకున్న మణిరత్నం. తాజాగా పొన్నియన్ సెల్వన్తో భారీ విజయంను అందుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఒక్క తమిళంలోనే కాకుండా విడుదలైన ప్రతి భాషల్లో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు.
సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న పీఎస్-2 సినిమా…ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్లు జరుపుతున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ మార్చి 29న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ట్రైలర్ను లోకనాయకుడు కమల్ హాసన్ రిలీజ్ చేస్తున్నట్టు లైకా ప్రోడక్షన్స్ ప్రకటించారు. ఇక తొలి పార్టుకు సంబంధించిన ట్రైలర్ను రజనీకాంత్తో కలిసి రిలీజ్ చేశారు. ట్రైలర్ వేడుకలను అత్యంత గ్రాండ్గా జరపాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుందట.
ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష వంటి అగ్ర తారలు నటించారు. ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చాడు. ఇప్పటికే రిలీజైన ఆగనందే పాట ఇన్స్టాంట్గా ఎక్కేసింది. లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 28న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతుంది.
Are you ready to witness history in the making?#UlagaNayagan @ikamalhaasan sir will grace the #PS2 music and trailer launch!
Nehru Stadium, Chennai at 6PM on 29th March!#CholasAreBack#PonniyinSelvan2 #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ pic.twitter.com/2PDXx6eA8C
— Lyca Productions (@LycaProductions) March 27, 2023
ఇవి కూడా చదవండి…