కామాక్షి మూవీస్ శివప్రసాదరెడ్డి కన్నుమూత

238
shivaprasad reddy
- Advertisement -

ప్రముఖ సినీ నిర్మాత, కామాక్షి మూవీస్‌ అధినేత శివప్రసాదరెడ్డి(62) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1985లో కామాక్షి బ్యానర్‌ను స్థాపించిన శివప్రసాదరెడ్డి.. శోభన్ బాబు,చిరంజీవి,నాగార్జునతో సినిమాలు తీశారు.శివప్రసాదరెడ్డికి ఇద్దరు కుమారులు.

శోభన్ బాబుతో కార్తీక పౌర్ణమి, శ్రావణసంధ్య,మెగాస్టార్ చిరంజీవితో ముఠామేస్త్రీ సినిమాలను తెరకెక్కించారు. నాగార్జునతో ఎక్కువగా సినిమాలు తెరకెక్కించారు శివప్రసాద రెడ్డి. నాగ్‌తో విక్కీ దాదా, అల్లరి అల్లుడు, బాస్‌, కింగ్‌ ,చివరగా గ్రీకువీరుడు సినిమాలను నిర్మించారు. శివప్రసాదరెడ్డి మృతి పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

- Advertisement -