అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలు తెలుసు : కళ్యాణ్ కృష్ణ

18
- Advertisement -

కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్ పై మార్చి 15న విడుదలైన సినిమా లంబసింగి. భారత్ రాజ్, దివి హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మించగా, నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు…

ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ….ముందుగా మీడియా వారికి ధన్యవాదాలు, మా సినిమాకు మీరు ఇచ్చిన రివ్యూస్ చాలా బాగున్నాయి. నేను ఒక దర్శకుడిగా ఉండి ఇంకో దర్శకుడితో సినిమా చెయ్యడానికి కారణం ఏంటంటే… టాలెంట్ ఉండి కూడా అవకాశాలు రాక చాలా మంది ఉంటారు, నేను కూడా అలా అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను అందుచేత నేను కొందరికి అవకాశం ఇద్దామని సినిమా నిర్మాణంలో అడుగు పెట్టాను. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్షన్ చెయ్యడానికి ఏడేళ్లు
వెయిట్ చేశారు, ప్రతిరోజు రేపే షూటింగ్ అనుకుంటూ గడిపే నాకు నాగార్జున గారూ నాకు అవకాశం ఇచ్చారు, ఆయనకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. దివి లాంటి చాలా మంది తెలుగు అమ్మాయిలు ఉన్నారు అందరికి అవకాశాలు రావాలి దివి ఈ సినిమాలో అద్భుతంగా నటించింది, భారత్ రాజ్ కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అననికి మంచి భవిషత్తు ఉండాలి. నవీన్ గాంధీ గారు తాను అనుకున్న కథను అద్భుతంగా తెరకెక్కించారు, ఆర్.ఆర్.ధ్రువన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఈ సినిమా కోసం సూపర్ మెలోడీస్ ఇచ్చారు, ఆర్ట్ ఝాన్సీ కెమెరామెన్ బుజ్జి ఇలా అందరూ కష్టపడ్డారు, వారి కష్టానికి ఫలితం ఈరోజు లభించింది, సినిమాను అందరూ చూసి ఎంకరేజ్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్.ధ్రువన్ మాట్లాడుతూ…
లంబసింగి సినిమా నాకు చాలా స్పెషల్, సాంగ్స్ బాగున్నాయని అందరూ అంటున్నారు. సినిమా చూసి వచ్చిన ప్రతిఒక్కరు ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్, ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్ లో చాలా నేర్చుకున్నాను అన్నారు.

నటుడు మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. .
సినిమాకు అందరి దగ్గర నుండి మంచి రెస్పాన్ లభిస్తోంది. దివి, భారత్ చాలా నేచురల్ గా చేశారు. ఒక మంచి లవ్ స్టొరీని డైరెక్టర్ గారు అందంగా చూపించారు. ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని అన్నారు.

Also Read:లవ్ గురు..అందమైన లవ్‌స్టోరి

దర్శకుడు నవీన్ గాంధీ మాట్లాడుతూ…
ఈ కథ రాసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇప్పుడు ప్రేక్షకులు అదే బరువైన హృదయంతో బయటికి వస్తున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన జీ.కె.మోహన్ గారికి థాంక్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ , మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, ఆర్ట్ ఝాన్సీ ఇలా అందరూ వారి బెస్ట్ ఇచ్చారు. దివి, భారత్ చాలా ఇంటెన్స్ తో నటించాని, మా లంబసింగి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

హీరోయిన్ దివి మాట్లాడుతూ…
కళ్యాణ్ కృష్ణ గారు ఒక తెలుగు అమ్మాయి కావాలని నన్ను ఈ సినిమాకు తీసుకోవడం నాకు చాలా ఆనందమేసింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి స్పెషల్ థాంక్స్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వండి, గుర్తించండి, మేము కూడా కష్టపడతాము, నవీన్ గాంధీ గారు సినిమాను అద్భుతంగా తీశారు. రెస్పాన్స్ బాగుందని అన్నారు.

హీరో భారత్ రాజ్ మాట్లాడుతూ…
కళ్యాణ్ కృష్ణ గారి దర్శకత్వంలో ఒక చిన్న రోల్ చెయ్యాలని అనుకున్నాను. అలాంటిది ఆయన నిర్మాతగా చేసే సినిమాలో లీడ్ రోల్ చెయ్యడం చాలా సంతోషంగా ఉంది. సినిమాలో మ్యూజిక్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, క్రెడిట్ మొత్తం ఆర్.ఆర్.ధ్రువన్ గారికి చెందుతుంది, నవీన్ గాంధీ గారు సినిమాను తీసిన విధానం చాలా బాగుంది. వీరవాబు పాత్రను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -