తెలంగాణ బిడ్డలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించడం గర్వకారణం: కవిత

195
kavitha
- Advertisement -

తెలంగాణ బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించడం పట్ల మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. అమెరికా లోని ప్రతిష్ఠాత్మక అబర్న్ విశ్వవిద్యాలయంలో సీటు సాధించిన మంచిర్యాల పట్టణానికి చెందిన సుహర్షను మాజీ ఎంపీ కవిత అభినందించారు. సుహర్షను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందించిన మాజీ ఎంపీ కవిత, సుహర్షకు అన్ని రకాలుగా సహకారం అందింస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా సుహర్షతో, సుహర్ష తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడిన మాజీ ఎంపీ కవిత.. కుటుంబ, వ్యక్తిగత వివరాల గురించి కూలంకషంగా చర్చించారు. సుహర్ష మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించిన మాజీ ఎంపీ కవిత… సుహర్ష, యువతకు ఆదర్శం అన్నారు.మంచిర్యాల టు అలబామ..అంతేకాక, యూనివర్సిటీ నుండి రూ. 50 లక్షల ఉపకారవేతనం, ట్యూషన్ ఫీజు మినహాయింపు పొందారు సుహర్ష.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ కవిత గారు అమెరికా లో ఉన్నత చదువులు అభ్యసించిన జ్ఞాపకాలను సుహర్షతో పంచుకున్నారు. మిసిసిప్పిలో ఎంఎస్ చదువుకున్న కవిత, అప్పుడు 500 డాలర్లు స్టైఫండ్ పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సుహర్ష సీటు సాధించిన అలబామా పక్కన ఉండే మిసిసిప్పి నగరంలోనే నివసించిన కవిత గారు, అక్కడి పరిస్థితులను సుహర్షతో పంచుకున్నారు.

కవితక్క అంటే ఎనలేని అభిమానం…తను కవితక్క కు పెద్ద అభిమాని అన్నారు సుహర్ష.సుహర్ష తండ్రి సింగరేణి ఉద్యోగి. కవితక్క పలుమార్లు మంచిర్యాల ప్రాంతంలో పర్యటించినప్పుడు, మాట్లాడటానికి ప్రయత్నించినా అవకాశం దొరకలేదన్న సుహర్ష… ఇప్పుడు స్వయంగా కవిత గారు ఫోన్ చేసి అభినందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తనకు ఈ అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందన్న సుహర్ష, సీఎం కేసీఆర్, అటవీ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, డీన్ చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.అభిమాన నాయకురాలు స్వయంగా ఫోన్ చేసి అభినందించడం ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్న సుహర్ష.. భవిష్యత్తులో స్వరాష్ట్రానికి సేవలు అందిస్తానని తెలిపారు.

- Advertisement -