మోహన్‌రావు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ కవిత..

235
kavitha
- Advertisement -

కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ సెక్రెటరీ మోహన్ రావు కుటుంబాన్ని హైదరాబాద్ ‌లో, మాజీ ఎంపీ, తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ స్టేట్ చైర్ పర్సన్ ‌కల్వకుంట్ల కవిత పరామర్శించారు.‌

మోహన్ రావు ఇంటికి వెళ్ళి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ని ప్రకటించారు మాజీ ఎంపీ ‌కవిత. అసోసియేషన్ ‌అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమం కోసం మోహన్ రావు నిరంతరం ‌కృషి చేసేవారని గుర్తుచేశారు‌.

మోహన్ రావు మృతి తీరని లోటన్న మాజీ ఎంపీ ‌కవిత, మోహన్ రావు‌ కుటుంబానికి అన్ని రకాలుగా ‌అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు ‌ఈ‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -