జయశంకర్ సార్‌ జయంతి..సాంగ్ రిలీజ్‌ చేసిన మాజీ ఎంపీ కవిత

193
kavitha
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం పరితపించిన మహనీయులు, తెలంగాణ రాష్ట్ర సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ అని నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు సైద్ధాంతిక పునాదిని వేసింది జయశంకర్ సర్ అన్నారు.

ఇవాళ ఆయన జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో నివాళులు అర్పించారు.తెలంగాణ ఉద్యమ దిక్సూచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో ప్రతీ యేడు వారి జయంతి నాడు తెలంగాణ జాగృతి వార్షికోత్సవం జరుపుకుంటున్నామన్నారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ప్రత్యేక గీతం ను మాజీ ఎంపీ కవిత ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ , వరలక్ష్మి మంచాల , జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి పాల్గొన్నారు.

- Advertisement -