నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా కల్వకుంట్ల కవిత

351
Kavitha Mlc
- Advertisement -

నిజామాబాద్ స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ స్ధానానికి టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ప్రకటించారు పార్టీ అధినేత సీఎం కెసీఆర్. కల్వకుంట్ల కవిత నేడు ఉదయం 11.30 గంటలకు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ వేయనున్నారు. రేపటితో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియనుంది.

మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డి పార్టీ మారడం… ఆయనపై అనర్హత వేటు పడటంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. కవిత నామినేషన్‌ కార్యక్రమాన్ని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యవేక్షిస్తుండగా.. జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు, పలువురు పార్టీ నేతలు హాజరుకానున్నారు.

- Advertisement -