త్వరలో మెదక్‌ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు: హరీశ్ రావు

156
harishrao
- Advertisement -

అతి త్వరలో మెదక్ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందిస్తామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. చిన్నశంకరంపేట మండలం కామారంలో డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌ రావు… రాష్ట్ర బడ్జెట్‌లో మూడో వంతు రైతులకే ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

గత ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మెదక్‌ జిల్లాలో రూ.94 కోట్లతో 1888 మంది రైతులకు బీమా సాయం అందించామని చెప్పారు. యాసంగిపంట సాయం కోసం జిల్లాకు రూ.190 కోట్లు ఇచ్చామన్నారు. వచ్చే ఆర్థికసంవత్సరం సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకునేందుకు డబ్బు ఇస్తామని ప్రకటించారు.

- Advertisement -