కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

12
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. హైదరాబాద్‌లో సీఎం రేవంత్ నివాసంలో పార్టీ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి…కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన కుమార్తె కడియం కావ్యతో కలిసి పార్టీలో చేరారు.

ఇక కడియం రాకను నిరసిస్తూ స్టేషన్ ఘన్‌పూర్‌లోని వివిధ మండలాల అధ్యక్షులు నిరసన వ్యక్తం చేశారు. కడియం గతంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు.

తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని శాపనార్థాలు పెట్టి ఇప్పుడు పార్టీలోకి వస్తే స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రమాదంలో పడ్డట్లేనని పేర్కొన్నారు.

Also read:IPL 2024:ఎస్‌ఆర్‌హెచ్ దూకుడు అగేనా?

- Advertisement -