కాబూల్‌లో పేలుళ్లు.. 20 మంది మృతి

102
- Advertisement -

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌ బాంబుల మోతతో దద్దరిల్లింది. కాబుల్‌లో ఖైర్‌ ఖానా ప్రాంతంలో ఉన్న ఓ మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా భారీ పేలుడు సంభవించింది. దీంతో మసీదు ఇమామ్‌ సహా 20 మంది మరణించారు.

ఈ ఘటనలో 40 మంది మృతిచెందగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం మసీదులో ప్రార్ధనలు జరుగుతుండగా పేలుళ్లు జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న భవనాల కిటికీల అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి.

- Advertisement -