హీరోగా మారనున్న దర్శకేంద్రుడు..

272
K Raghavendra Rao
- Advertisement -

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ కె.రాఘవేంద్రరావు గురించి ఈ రోజు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శతాధిక చిత్రాల ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌ర‌రావు సీనియర్ ఎన్టీఆర్ ద‌గ్గ‌ర నుండి ఈ కాలం కుర్ర హీరోల వ‌ర‌కు ఎన్నో అద్భుత‌మైన చిత్రాలు చేశారు. ద‌ర్శ‌కుడిగా రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌స్థానం అనిర్వ‌చ‌నీయం. అయితే ఇప్పుడు ఆయ‌న కొత్త జ‌ర్నీని మొదలు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ వయసులో ఆయన కెమెరా ముందుకు వస్తున్నారు. అది కూడా కథానాయకుడుగా!

ఆమధ్య ‘మిథునం’ వంటి రమణీయమైన చిత్రాన్ని రూపొందించిన ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో రాఘవేంద్రరావు హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత జనార్దన మహర్షి కథను అందించగా.. కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చిత్రంలోని పాటలను చంద్రబోస్ రాస్తున్నారు.

ఇక ఈ సంచలన చిత్రంలో నలుగురు కథానాయికలు ఉంటారని అంటున్నారు. ఇప్పటికే రమ్యకృష్ణ, శ్రియ, సమంతలను ముగ్గురు కథానాయికలుగా ఎంపిక చేశారనీ, మరో కొత్త కథానాయికను పరిచయం చేస్తారని సమాచారం. ఇందులో రమ్యకృష్ణ ఆయనకు భార్యగా నటిస్తున్నట్లు సమాచారం. అయితే రాఘ‌వేంద్ర‌రావు సినిమా గురించి గొప్ప ప్ర‌క‌ట‌న చేయాల‌నుకుంటున్నాం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్ మెంట్ చేయ‌నున్నాం అని త‌నికెళ్ల భ‌ర‌ణి అన్నారు.

- Advertisement -