వెండి తెరపై ఫూలే..

98
phule
- Advertisement -

దేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు కంకణం కట్టుకున్న సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావ్ ఫూలే బయోపిక్ రానుంది. ఏప్రిల్ 11న ఆయన 195వ జయంతి సందర్భంగా సినిమాను అనౌన్స్‌ చేశారు మేకర్స్‌. వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న ప్రతీక్…ఫూలే పాత్రను పోషించనున్నారు.

నేషనల్ అవార్డ్ విన్నర్ అనంత్ నారాయణ మహదేవన్ దర్శకత్వం వహించే ఈ సినిమాను డా. రాజ్ కిశోర్‌ ఖవారే, ప్రణయ్ ఖోస్కీ, సౌరభ్ వర్మ, ఉత్పల్ ఆచార్య, అనుయ చౌహాన్, రితీష్‌ నిర్మించబోతున్నారు. సావిత్రి బాయి పూలేగా జాతీయ ఉత్తమ నటుడు రాజ్ కుమార్ రావ్ భార్య పత్రలేఖ నటించబోతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లే మేకర్స్ అనౌన్స్ చేశారు.

- Advertisement -