గుజరాత్ జైత్రయాత్రకు బ్రేక్..

68
hyderabad
- Advertisement -

ఐపీఎల్ 15వ సీజన్‌లో తొలి ఓటమిని మూటగట్టుకుంది గుజరాత్. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గుజరాత్ విధించిన 163 పరుగుల టార్గెట్‌ని హైదరాబాద్ 19.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది గుజరాత్. కెప్టెన్ కేన్ విలియమ్ సన్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 46 బంతుల్లో 57 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 32 బంతుల్లో 42 పరుగులతో రాణించాడు.

ఇక తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. 42 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అభినవ్ మనోహర్ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు.

- Advertisement -