శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు…

128
ttd
- Advertisement -

తిరుమల శ్రీవారిని ఇవాళ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటరమణ, జస్టిస్‌ కృపాసాగర్‌, తెలంగాణ న్యాయమూర్తి జస్టిస్‌ నాగేశ్‌ భీమపాక స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు , తీర్థప్రసాదాలు అందించారు.

శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతుండగా 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 79,833 మంది భక్తులు దర్శించుకోగా 36,074 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -