- Advertisement -
దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6809 కరోనా కేసులు నమోదుకాగా మొత్తం కేసుల సంఖ్య 4,44,56,535కు చేరాయి. ప్రస్తుతం దేశంలో 55,114 యాక్టివ్ కేసులుండగా 4,38,73,430 మంది కరోనా నుండి కోలుకున్నారు. రోజువారి పాజిటివిటి రేటు 2.12 శాతంగా ఉండగా 5,27,991 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
మొత్తం కేసుల్లో 0.12 శాతం కేసులు యాక్టివ్గా ఉండగా రికవరీ రేటు 98.69 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 213.20 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వైద్యశాఖ వెల్లడించింది.
- Advertisement -