జులై 1న గ్రూప్-4 పరీక్ష…

26
- Advertisement -

తెలంగాణ ఉద్యోగ జాతరలో భాగంగా గ్రూప్‌-4 పరీక్ష తేదీని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. జులై1న ఈ పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. జులై 1న ఉదయం 10గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్‌-1 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

కాగా గ్రూప్ -4 అప్లీకేషన్‌ను జనవరి 30తో దరఖాస్తులకు గడువు ముగిసిపోయిన నేపథ్యంలో ఫిబ్రవరి 3వరకూ పొడిగించింది. కాగా ఇప్పటివరకూ 8,47,277 మంది అప్లై చేసుకోగా.. దరఖాస్తు గడువు పెంచడంతో ఈ సంఖ్య మరింతగా పెరగనుంది. త్వరలో గ్రూప్‌-2,3లకు టైమ్‌ షెడ్యూల్ విడుదల చేయనున్నట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి…

త్వరగా బరువు పెంచే ఆహార పదార్థాలు!

భారీగా పెరిగిన పసిడి ధరలు…

గ్యాస్ సమస్యలను దూరం చేసే ‘యోగముద్రాసనం’!

- Advertisement -