సముద్రంలో ఆ స్టార్ల మధ్య ఫైట్

28
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ కథకే కాదు, కథ జరిగే నేపథ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత షెడ్యూల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. వైజాగ్ బీచ్ లో ఎన్టీఆర్ – సైఫ్ అలీ ఖాన్ లపై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను కొరటాల శివ ప్లాన్ చేశాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

అందుకే, సముద్రంలో జరిగే ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. ఈ సీక్వెన్స్ ను ఈ నెల రెండో వారం నుంచి స్టార్ట్ చేయనున్నారు. అలాగే కథకు అవసరమైన సముద్రపు విజువల్స్ ను కూడా డ్రోన్ షాట్ లో షూట్ చేసి.. అనంతరం వాటికీ భారీ విజువల్ ఎఫెక్ట్స్ అద్దనున్నారు. హాలీవుడ్ స్థాయిలో ఈ షాట్స్ ఉంటాయని.. ముఖ్యంగా సముద్రంలో జరిగే ఛేజింగ్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయని టాక్.

Also Read:హ్యాపీ బర్త్ డే..అనుష్క శర్మ

కేవలం ఈ సీక్వెన్స్ ను దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ను ఈ సినిమాకు తీసుకున్నారు. ఇప్పటికే కెన్నీ బేట్స్ కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేశారు. ఈ సినిమాను తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏప్రిల్ 5, 2024న విడుదల చేయనున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ అంతర్జాతీయ మూవీని కొరటాల శివ కసితో తెరకెక్కిస్తున్నాడు.

Also Read:హ్యాపీ బర్త్ డే… అజిత్

- Advertisement -