ఓటేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌

14
- Advertisement -

నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా క్యూ లైన్‌లో ఉన్న వారికే ఓటు వేసే అవకాశం కల్పించనున్నారు.

హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. తల్లి, సతీమణితో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్.. క్యూ లైన్‌లో నిల్చోని ఓటేశారు.మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు తన సతీమణితో కలిసి ఫిలింనగర్‌లోని ఓబుల్‌రెడ్డి పాఠశాలలో, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ మాదాపూర్‌లో ఓటేవేశారు.

ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీస్‌లో ఉన్న పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన అల్లు అర్జున్‌.. అందరితోపాటు ఆయన తన వంతు కోసం క్యూలైన్‌లో వేచిఉండి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు.

Also Read:సత్యదేవ్ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌

- Advertisement -