కరోనా..చావు బతుకుల్లో చైనా జర్నలిస్ట్

136
china
- Advertisement -

కరోనా కట్టడిలో చైనా ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసిన జర్నలిస్ట్ ఝాంగ్ ఝాన్‌ చావు బతుకుల మధ్య కొట్టాడుతోంది. గత ఫిబ్రవరిలో వుహాన్ నుంచి స్మార్ట్ ఫోన్ తో వీడియోలు తీసి ఆమె ప్రసారం చేయడంతో ‘గొడవలను రెచ్చగొట్టి, సమస్యలను సృష్టించేందుకు’ చూసిందంటూ ఆమెకు నాలుగేండ్ల జైలు శిక్ష విధించారు.

తనకు అన్యాయంగా శిక్షించడాన్ని వ్యతిరేకిస్తూ ఆమె నిరాహారదీక్ష చేపట్టారు. ఝాంగ్ ఝాన్ జైలులో నిరాహార దీక్ష కొనసాగిస్తోందని, ఆమె ఆరోగ్యం క్షీణించిందని, ఇంకెన్నో రోజులు బతకకపోవచ్చని ఆమె సోదరుడు ఝాంగ్ జూ ఇటీవల ట్వీట్ చేయడంతో విషయం వైరల్ అయింది. దీంతో ఝాంగ్​ను విడుదల చేసేలా ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ చైనా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ మానవ హక్కుల సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -