గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న..

44
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న ఈరోజు శ్రీ నగర్ కాలనీలోని తమ ఆఫీసు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. పర్యవరణాన్ని పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరు తమ అఫీసులోగానీ ఇంటి ప్రాంగణంలో ఎక్కడ వీలు అయితే అక్కడ మొక్కలు నాటాలని కోరారు.

ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. మొక్కలు నాటే బాధ్యత మనమందరం తీసుకొని వాటిని సంరక్షించుకోవాలని స్వప్న అన్నారు .అనంతరం చిన్న వాసుదేవరెడ్డి,మంజులత కళానిధి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు స్వప్న.

- Advertisement -