సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో జరిగిన ఐదో యాషెస్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో జో రూట్ అద్భుతమైన ఆటతో 150కు పైగా పరుగులు సాధించాడు. ఈ ఇన్నింగ్స్తో టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ను అధిగమించే దిశగా రూట్ మరింత దగ్గరయ్యాడు.
ఇంగ్లండ్ స్టార్ జో రూట్ తన మిడాస్ టచ్ను కొనసాగిస్తూ సిడ్నీ టెస్టులో తన 41వ టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఒక్క సెంచరీ కూడా లేకుండా వచ్చిన రూట్, ఈ యాషెస్ సిరీస్లో ఇప్పటికే రెండు శతకాలు బాదాడు. తొలి సెంచరీ బ్రిస్బేన్ టెస్టులో వచ్చింది.
టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగుల ప్రపంచ రికార్డు సచిన్ టెండూల్కర్దే. ఆ రికార్డుకు రూట్ ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారాడు. ఇప్పటికే టెస్టుల్లో రెండో అత్యధిక పరుగుల సాధకుడిగా ఉన్న రూట్, ఇప్పుడు సచిన్ రికార్డును చేధించే ప్రయత్నంలో ఉన్నాడు.
ఐదో టెస్టుకు ముందు రూట్ ఖాతాలో 13,777 పరుగులు ఉండగా, సచిన్ టెండూల్కర్ టాప్లో 15,921 పరుగులతో ఉన్నాడు. అంటే రూట్ 2,144 పరుగుల వెనుకబడి ఉన్నాడు. అయితే సిడ్నీ టెస్టులో అతని అద్భుత ఇన్నింగ్స్తో ఆ గ్యాప్ 2,000 పరుగుల లోపుకు తగ్గింది. రెండో రోజు ఆటలో రూట్ 150కి పైగా పరుగులు చేయడంతో ఈ అంతరాన్ని 2,000 కంటే తక్కువకు తీసుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో రూట్ 150కు పైగా పరుగులతో తన 17వ 150+ స్కోర్ను నమోదు చేశాడు. దీంతో టెస్టు క్రికెట్లో అత్యధిక 150+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మహేల జయవర్ధనేను అధిగమించాడు. ఈ జాబితాలో ఇప్పుడు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, కుమార్ సంగక్కార, డాన్ బ్రాడ్మన్ల తర్వాతి స్థానంలో రూట్ నిలిచాడు. ప్రస్తుతం రూట్ 297 టెస్టు ఇన్నింగ్స్ల్లో 13,937 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ (15,921) రికార్డును అధిగమించడానికి ఇంకా 1,984 పరుగులు అవసరం.
Also Read:అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య

