ఒక్కటైన జియో..షియోమీ..!!

281
Jio ties up with Xiaomi
- Advertisement -

ఫ్రీ ఆఫర్లతో టెలికం కంపెనీలకు  రిలయన్స్ జియో హడలు పుట్టించిన విషయం తెలిసిందే. అయితే..తాజాగా చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ, రిలయన్స్ జియో సంస్థలు ఒక్కటయ్యాయి. ఈ సందర్భంగా షియోమీ గురువారం విడుదల చేసిన రెడ్‌మీ 5ఎ కొనుగోలుదారులకు రూ.1000 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టు జియో ప్రకటించింది.

రెడ్‌మీ 5ఎ ప్రారంభోత్సవంలో షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మాట్లాడుతూ ‘రెడ్‌మీ 5ఎ’ యూజర్లు ‘బెటర్ టు గెదర్ ఆఫర్’లో భాగంగా అదనంగా వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ పొందవచ్చని తెలిపారు. ఇందుకు రెడ్‌మీ 5ఎ వినియోగదారులు ఏడాది పాటు రూ.199తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఈ ఆఫర్ కింద 28 రోజుల పాటు రోజుకు ఒక జీబీ చొప్పున 28 జీబీ, అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. నవంబరు 30-డిసెంబరు 5 మధ్య మొదటి రీచార్జ్ చేయించాలి. రూ.100 చొప్పున 10 వోచర్లు 12 నెలలలోపు వినియోగదారుల ఖాతాలోకి వస్తాయి. ఈ వోచర్లు రూ.399 కంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే మొత్తానికి మాత్రమే వాడాలి. అదనపు వివరాల కోసం జీయో కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చు.

- Advertisement -