రిలయన్స్ జియో ఎంట్రీతో ఇప్పటికే టెలికాం రంగంలో డేటా విప్లవం మొదలయింది. ఉచిత డాటా, ఉచిత రోమింగ్ అంటూ టెలికం మార్కెట్ లోకి దూసుకు వచ్చిన జియో మార్కెట్ను షేక్ చేసింది. జియో దెబ్బకు టెలికాం దిగ్గజాలు దిగిరాక తప్పలేదు. జియోకి దీటుగా బంపర్ ఆపర్లు ప్రకటిస్తున్న….అంతగా ఆకట్టుకోలేక పోయాయి. తాజాగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మూడు నెలలు కాదు.. ఏకంగా 15 నెలలపాటు ఇంటర్నెట్ ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది రిలయన్స్ జియో. ప్రస్తుతం డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఇది మరో ఏడాది కూడా పొడిగిస్తామని బంపరాఫర్ ఇచ్చింది. అయితే కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. ఈ 15 నెలల ఉచిత ఇంటర్నెట్ కావాలంటే.. ఐ ఫోన్ కొనుగోలు చేయాలి. ఐఫోన్ 7, 7 ప్లస్ కొనుగోలు చేసే వారికే కాకుండా.. ఐ ఫోన్ సిరీస్ ఏది కొన్నా మీరు ఏడాది పాటు జియో ఉచిత ఇంటర్నరెట్ పొందుతారు. శుక్రవారం ఇండియా మార్కెట్ లో ఐ ఫోన్ 7, 7ప్లస్ విడుదల అయిన సందర్భంగా ఈ ఆఫర్ ప్రకటించింది రిలయన్స్.
2017 జనవరి నుంచి ఈ ఆఫర్ ను వినియోగించుకోవచ్చు. రిలయన్స్ రిటైల్ స్టోర్ దగ్గర కానీ, యాపిల్ స్టోర్ దగ్గర కానీ ఐఫోన్ కొనుగోలు చేసిన కస్టమర్లకు డిసెంబర్ 31 వరకు వెలకమ్ ఆఫర్ పొందవచ్చు. జనవరి 1వ తేదీ నుంచి వీరంతా 1499 రూపాయల ప్లాన్ను పూర్తి ఫ్రీగా పొందే చాన్స్ ఉంటుంది. ఈ ప్లాన్ కింద ఈ కస్టమర్లు 18,000 రూపాయల విలువైన సర్వీసులు పొందుతారు. ఇక, 1,499 రూపాయల ప్లాన్లో భాగంగా అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్, ఫ్రీ రోమింగ్, 20 జీబీ 4 జీ డేటా, రాత్రి అపరిమిత 4జీ డేటా, 40 జీబీ వైఫై డేటా, అన్లిమిటెడ్ ఎస్ఎమ్ఎస్లు, అన్లిమిటెడ్ జియో యాప్స్ లభిస్తాయి.