జీవిత రాజశేఖర్ కుటుంబంలో మరో విషాదం..

297
Jeevitha rajsekhar
- Advertisement -

గరుడ వేగా రిలీజ్ కి సిద్దం అవుతున్న తరుణంలో హీరో రాజశేఖర్ ఇంట విషాదం అలుముకుంది. రాజశేఖర్ భార్య, నటి జీవిత స్వంత సోదరుడు మురళి మృతి చెందారు. మురళి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అనారోగ్యంతో ఉన్న మురళిని చూసుకుంటూనే సినిమా విడుదల ముందు జరిగే ప్రమోషన్ కార్యక్రమాల్లో రాజశేఖర్, జీవిత బిజీగా వున్నారు. సినిమాకు స్పేషల్ ప్రీమియర్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఇలా విషాదం జరిగింది.

 Rajasekhar-&-Jeevitha

రాజశేఖర్ ఓ ఇంటర్వూలో వుండగా పరిస్థితి బాగా లేదని కబురు అందడంతో ఆయన వెంటనే సగంలో కార్యక్రమం ఆపేసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. అర్థరాత్రి సమీపంలో మురళి మరణించారు.ఇటివలే రాజశేఖర్ తల్లి మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుండి ఇంకా తేరుకోకముందే మరో విషాదం జరగడం ఆ కుటుంబానికి మరింత బాధించింది.మురళి శ్రీనివాస్ పార్ధివదేహన్ని సందర్శనార్ధం ఈరోజు ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఫిలిం ఛాంబర్‌లో ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితమే రాజశేఖర్ అమ్మ కూడా మరణించారు.

- Advertisement -