బీఆర్‌ఎస్‌ ఆవిర్భావానికి కుమారస్వామి

146
- Advertisement -

బీఆర్ఎస్ ఆవిర్భవ దినోత్సవంలో పాల్గొనేందుకు హైదరాబాద్ చేరుకున్నారు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామికి శంషాబాద్ విమానాశ్రయంలో పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి, చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి, సుమన్ లు పూలమాలలు, శాలువాలతో కుమారస్వామిని సన్మానించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కుమార స్వామి, ఆయన వెంట వచ్చిన పలువురు కర్ణాటక రాష్ట్ర నేతలు బీఆర్ ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కు వెళ్లారు.

ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ చేరుకోనున్నారు సీఎం కెసిఆర్ . ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు ప్రకాశ్‌ రాజ్‌ పాల్గొననున్నారు. అనంతరం తెలంగాణ భవన్ లో పూజలో పాల్గొనన్నారు.సరిగ్గా 1:20 నిమిషాలకు సంబంధిత పత్రాలపై సంతకాలు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -