సీఎం కేసీఆర్‌తో దేవెగౌడ సమావేశం..

227
CM KCR
- Advertisement -

జేడీఎస్ చీఫ్‌, మాజీ ప్రధాని దేవెగౌడ ఆదివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవెగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను కూడా బహూకరించారు.

ఈ సందర్భంగా పలు విషయాలపై ఇరువురు నేతలు చర్చించారు. సమావేశం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి దేవేగౌడ బెంగళూరుకు బయల్దేరారు. హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డి మనవడి వివాహానికి హాజరయ్యేందుకు నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు దేవేగౌడ వచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -