ఎవరితో టచ్‌లో లేను:లక్ష్మీ నారాయణ

240
JD-Laxminarayana
- Advertisement -

అవినీతి పరుల గుండెల్లో గుబులు పుట్టించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీబీఐ మాజీ డైరెక్టర్‌ జేడీ లక్ష్మీనారాయణ తన పదవికి స్వచ్చంద రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి రానున్నారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరుతారని కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీటిని ఖండించారు లక్ష్మీనారాయణ.

తాను ఏ రాజకీయ పార్టీతోనూ టచ్‌లో లేనని, కేవలం ప్రజలతోనే టచ్‌లో ఉన్నట్లు స్పష్టం చేశారు. విజయనగరంలో ప్రజలతో మాట్లాడిన ఆయన ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించేందుకే గ్రామల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. బీజేపీతో టచ్‌లో ఉన్నాననే వార్తల్లో నిజం లేదని.. తనకు ఆపరేషన్‌ గరుడ అంటే ఏమిటో తెలియదన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు న్యాయ నిపుణులతో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నారు.

తెలుగు వ్యక్తి అయిన లక్ష్మీనారాయణ ఐపీఎస్ ఆఫీసర్‌గా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. సత్యం కుంభకోణం లాంటి పలు కీలక కేసులను చేపట్టి.. నిర్భయంగా దర్యాప్తు పూర్తి చేసి వార్తల్లో నిలిచారు.

- Advertisement -