విశాఖ ఎంపీ బరిలో జేడీ లక్ష్మీనారాయణ..

267
pawan jd laxmi narayana
- Advertisement -

జనసేన పార్టీ పాలుగో లిస్టు విడుదలైంది. నాలుగో జాబితాలో ఒక పార్లమెంట్,ఎనమిది ఎంపీ స్ధానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవలె జనసేనలో చేరిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ పార్లమెంట్ స్ధానాన్ని కేటాయించారు. జనసైనికుడిగా పవన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించిన లక్ష్మీనారాయణ ఈ ఎన్నికల్లో పోటీచేస్తారా లేదా అన్న సందిగ్దం అందరిలో నెలకొనగా ఆ వార్తలకు చెక్ పెడుతూ విశాఖ ఎంపీగా ఆయన్ని బరిలో నిలిపారు పవన్‌.

ఇక విశాఖలోని గాజువాకతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుండి పవన్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటినుండి జనసేన అభిమానులు, కార్యకర్తలు అంతా పవన్‌ రెండు చోట్ల పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ రెండు చోట్ల నుండి బరిలో దిగేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

లక్ష సభ్యత్వాలతో ఏపీలోనే గాజువాక నియోజకవర్గం అగ్రస్థానంలో ఉంది. అన్నింటికి మించి విశాఖలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే గాజువాక స్ధానాన్ని ఎంచుకున్నారు పవన్‌. అంతేగాదు జనసేన బలంగా ఉన్న విశాఖ నుండే జేడీని బరిలో నిలిపారు జనసేనాని.

- Advertisement -