మేము విన్నాం..మేం వస్తున్నాం

263
vijayamma sharmila
- Advertisement -

నేను విన్నాను..నేను ఉన్నాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో డైలాగ్ ఇది. ఇప్పుడు ఇదే డైలాగ్‌ను వాడుకుంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు వైఎస్ జగన్‌. నేను విన్నాను…నేను చూశాను..నేను ఉన్నాను అంటూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.

ఓ వైపు జగన్ ప్రచారం నిర్వహిస్తుండగా మేము విన్నాం…మేం వస్తున్నాం అంటూ ప్రచారానికి రానున్నారు వైఎస్ విజయమ్మ,షర్మిల. వీరిద్దరికి కోసం వైసీపీ ప్రత్యేకంగా ప్రచార రథాలను సిద్ధం చేస్తోంది.

మార్చి 27న మంగళగిరి నుండి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్న షర్మిల మొత్తం పది జిల్లాల్లో ప్రచారం నిర్వహించనుంది. దాదాపు 50 నియోజకవర్గాల్లో షర్మిల సభలుండనుండగా ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురంలో ఆమె యాత్ర ముగియనుంది. ఒక వైఎస్ విజయమ్మ సైతం దాదాపు 40 నియోజకవర్గాల్లో ప్రచారం చేయనుంది. మొత్తంగా విజయమ్మ, షర్మిలను ప్రచారానికి దించితే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందని భావిస్తున్న జగన్‌కు వీరిద్దరు ఎలాంటి ఫలితాలను ఇస్తారో వేచిచూడాలి.

2012లో ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ జైళ్లో ఉండడంతో వీరిద్ద‌రూ ప్రచార బాధ్యతలను భుజాన ఎత్తుకున్నారు. అభ్యర్థుల తర‌పున ప్ర‌చారం నిర్వ‌హించారు. 2014 ఎన్నిక‌ల స‌మయంలోనూ ఎలక్షన్ క్యాంపెయన్ చేశారు విజయమ్మ, షర్మిల.

- Advertisement -