‘అమ్మ’ కు ఘన నివాళి..

297
- Advertisement -

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూసి ఇవాల్టికి ఏడాది పూర్తయ్యింది. 2016 డిసెంబర్ 5వ తేదీన ఆమె చెన్నైలోని అపోలో హాస్పటల్‌లో తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆమె మరణించిన విషయం తెలిసిందే.  జయలలిత ప్రథమ వర్థంతి సందర్భంగా అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నేతలు, పలువురు సినీ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు.

 Jayalalithaa's First Death Anniversary..

వీరితో పాటు చెన్నైలోని మెరీనా బీచ్‌ వద్ద గల జయలలిత సమాధి వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి ఆమెకు నివాళులర్పించారు. జయతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు కొందరు. ఆమె హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకు ‘ అమ్మ’గా నిలిచిందని పలువురు నేతలు కొనియాడారు.

- Advertisement -