జపాన్‌లో భారీ భూకంపం..

23
- Advertisement -

భారీ భూకంపం ధాటికి జపాన్ అతలాకుతలమైంది. జపాన్‌ పశ్చిమ తీరాన్ని ఈ నెల 1న భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం రాగా భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేలాది భవనాలు కుప్పకూలాయి. పెద్ద సంఖ్యలో కార్లు, వాహనాలు దెబ్బతిన్నాయి.

ఇక మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటివరకు భూకంపం ధాటికి 92 మంది చనిపోగా 242 మంది గల్లంతయ్యారని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని వెల్లడించారు అధికారులు. సుమారు 32 వేల మంది బాధులు నిరాశ్రయులయ్యారని వెల్లడించారు.

భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా తాగునీరు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరించలేదని బాధితులు తెలిపారు. కాగా, శిథిలాల తొలగింపు ప్రక్రియ జరుగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.

Also Read:ఫిబ్రవరి 2న…గేమ్ ఆన్

- Advertisement -